భూ భారతి పోర్టల్ పై హర్షం వ్యక్తం
చేసిన రైతులు
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు.
వెంకటాపూర్ మండలానికి చెందిన
రైతు మొగిలి మాట్లాడుతూ గతంలోని పాలకులు ఏర్పాటు చేసిన ధరిణి తో అనేక ఇబ్బందులకు గురయ్యామని, తమభూమి తమ పేరు మీదికి మార్చుకోవడానికి చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో తమ ఇబ్బందులు తొలిగిపోయే అవకాశం ఉందని ఆశా భావం వ్యక్తం చేశారు.
తైనేని సరోజన.

తమ పేరు మీదికి తమ భూమిని మార్చాలని కోరుతూ గత పది సంవత్సరాలుగా అన్ని కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికీ తన సమస్య పరిష్కారం కాలేదని మరో మహిళ రైతు తైనేని సరోజినీ ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో సాదా బైనమా ద్వారా పత్రాలు ఇచ్చినప్పటికీ ధరణి పోర్టల్ లో పేరు నమోదు కాకపోవడంతో రైతుబంధు అందలేదని, బ్యాంకులవారు రుణాలు ఇవ్వలేదని అన్నారు. తన ఇబ్బందులను గుర్తించి నూతన భూ భారతి లో పట్టా అందజేయాలని కోరారు.
పర్వతాలు…
తాను సాగు చేసుకుంటున్న భూమిలో పలు రకాల పంటలు పండిస్తున్నప్పటికీ నేటి వరకు తన పేరుపై పట్టా కాలేదని మరో రైతు పర్వతాలు తెలిపారు. తాను మోకాపై ఉన్నప్పటికీ ఇతరుల పేరుపై భూమి ఉందని, ఇప్పటికైనా తన పేరుపై పట్టా చేయాలని కోరారు.
