భూభారతి చట్టంపై ప్రతిరైతు అవగాహన పెంచుకోవాలి..జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *భూభారతి – చట్టం 25, అవగాహన సదస్సు శనివారం జిల్లాలోని చిన్న గూడూరు మండలం, ఉగ్గంపల్లి గ్రామం రైతువేదికలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. వీరబ్రహ్మంచారి, రెవెన్యూ డివిజనల్ అధికారి గణేశ్, స్థానిక తహసిల్దార్ మహబూబ్ అలీ, తదితరులు హాజరై తెలంగాణ గీతం ఆలపించి, పిపిటి, చదివి రైతులకు భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో భూభారతి సేవలు అందించాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టం 2025, ప్రవేశపెట్టిందని ప్రజల సౌకర్యార్థం అనేక మార్పులు చేర్పులు చిన్నచిన్న పొరపాట్లను సరిచేసుకునే అవకాశం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో భూ సమస్యను గుర్తించి సంబంధిత తహసిల్దార్ రెవిన్యూ డివిజనల్ అధికారి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, కలెక్టర్, కమిషనర్ తదితర స్థాయిల్లో సమయానుకూలంగా సమస్యను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.

ఈ చట్టంపై ప్రతి ఒక రైతు వివరాలు అడిగి తెలుసుకోవాలన్నారు.
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. వీరబ్రహ్మచారి మాట్లాడుతూ ఉదాహరణకు గత ధరణి కాలంలో చిన్న సమస్య పరిష్కరించడం కోసం అనేక ఇబ్బందులు ఏర్పడేవని కోర్టు వరకు వెళ్లి వారి ఆదేశాల ప్రకారం రెవెన్యూ అధికారులు
నడుచుకొనేవారని, ఇప్పుడు నాథన్ చట్టం ద్వారా సమస్య సులభంగా పరిష్కారం అవుతుందని తెలిపారు.

అంతకుముందు రెవిన్యూ డివిజనల్ అధికారి గణేష్ చట్టం యొక్క వివరాలను రైతులకు, హాజరైన ప్రజలందరికీ చదివి వినిపించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అర్థమయ్యే రీతిలో చెప్పారు.

గ్రామంలోని రైతులు కృష్ణారెడ్డి, వెంకన్న, కమలాకర్ తదితరులు చట్టంలోని కొన్ని కొన్ని విషయాల పై వివరాలు కోరగా కలెక్టర్, అదనపు కలెక్టర్ వారి సందేహాలకు సమాధానాలు, పరిష్కార మార్గాల పై వివరించారు.

అనంతరం చిన్న గూడూరు మండల కేంద్రం, పర్వతగిరి గ్రామం సోమ్లా తండాలోని సహకార శాఖ ఆధ్వర్యంలో నడిచే దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రంలో అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని టార్పాలిన్స్, గన్ని సంచులు అందుబాటులో ఉంచాలని, మాయిశ్చర్ వచ్చే విధంగా చూసుకుని ఎఫ్.సి.ఐ నామ్స్ ప్రభుత్వ సూచనల ప్రకారం దాన్యం కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేసి వెంటనే సంబంధిత రైతుకు డబ్బులు పడే విధంగా సెంటర్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి గణేష్, డీఎస్ఓ ప్రేమ్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారిని కృష్ణవేణి, స్థానిక తహసిల్దార్ మహబూబ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *