సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లోసహపంక్తి భోజనం

వరంగల్ జిల్లా/దుగ్గొండి: 19 ఏప్రిల్ 2025.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని ముద్దునూరులో సన్న బియ్యం లబ్ధిదారుడు దిద్దే సరోజన చేరాలు కుటుంబ సభ్యులతో కలిసి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ అడిగారు. మీతో కలిసి భోజనం చేయడం సంతోషంగా ఉందన్నారు.

అనంతరం ఎంపీ మాట్లాడుతూ
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
పేద, సామాన్య ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని అన్నారు. గతంలో రేషన్‌ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా వాటిని చాలా మంది లబ్ధిదారులు తినేందుకు విముఖత చూపుతూ ఇతరులకు విక్రయించేవారని, సన్నబియ్యం మార్కెట్‌లో కొనుక్కుని తినేవారన్నారు. ప్రభుత్వంపై భారం పడుతున్నా పేద సామాన్య ప్రజలు కడుపునిండా తినేందుకు సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం… తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉపయోగపడుతుందని, ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమని,పేద ప్రజలు ఆకలితో బాధపడకుండా పోషకాహారాన్ని పొందాలన్నదే ఈ పథక ప్రధాన ఉద్దేశమని వివరించారు.
సన్న బియ్యం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా చర్యలు తీసుకోవాలని,పంపిణీ వ్యవస్థలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు సూచించారు.
పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉపయోగపడుతుందని, ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమని,పేద ప్రజలు ఆకలితో బాధపడకుండా పోషకాహారాన్ని పొందాలన్నదే ఈ పథక ప్రధాన ఉద్దేశమని వివరించారు.

సన్న బియ్యం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా చర్యలు తీసుకోవాలని,పంపిణీ వ్యవస్థలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు సూచించారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూరేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసిన సన్నబియ్యం భోజనం చాలా బాగుందని, మన ప్రాంతంలో రైతులు పండించిన వరిధాన్యపు బియ్యాన్ని మనం తినే అవకాశం దక్కడం అదృష్టంగా భావించాలని అన్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా రేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వలు లేకుండా ప్రతీకార్డుదారు సన్నబియ్యం తీసుకెళ్తున్నారన్నారు. ఇప్పటి వరకే రేషన్ దుకాణాల్లో 90శాతం పంపిణీ పూర్తి అయిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆదనవు కాలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *