రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే పనిచేసే వారికి అవకాశం ఇవ్వండి.. కడియం శ్రీహరి

జనగామ: 29.04.2025: ఏ రాజకీయ పార్టీకైనా సంస్థాగత నిర్మాణమే ముఖ్యమని, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయమని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే…. రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి కావాలంటే నాయకుల చుట్టూ తిరిగే వారికీ కాకుండా… ప్రజలలో ఉంటూ పార్టీ కోసం పని చేసే వారికీ అవకాశాలు ఇవ్వాలని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఎంపీ చామల్ల కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి పరిశీలకులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, లింగం యాదవ్ గార్లతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే…. రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి కావాలంటే నాయకుల చుట్టూ తిరిగే వారికీ కాకుండా… ప్రజలలో ఉంటూ పార్టీ కోసం పని చేసే వారికీ అవకాశాలు ఇవ్వాలని అన్నారు.

పార్టీలోకి ముందు వచ్చామా, వెనక వచ్చామా అన్నది ముఖ్యం కాదని, పది మందిని కదిలించి…. పది ఓట్లు వేయించే వారే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అన్ని రకాలుగా ఉన్నప్పుడే ముందుకు వెళ్ళగలమని తెలిపారు. పార్టీకి నమ్మకంగా పని చేయడంతో పాటు ప్రజల కష్టసుఖలలో పాలు పంచుకోవాలి, పది రూపాయలు ఖర్చు పెట్టగలగాలి అప్పుడే రాజకీయాలలో ముందుకు వెళ్ళగలమని తెలిపారు. నేను ఏ పార్టీలో ఉన్నా నమ్మకంగా పని చేస్తానని వెల్లడించారు. కొంత మంది ఒకే పార్టీలో ఉంటూ స్వంత పార్టీ నాయకుల పైనే ప్రెస్ మీట్లు పెట్టి మరి విమర్శలు చేస్తారని, సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడతారు అని అన్నారు. అది మంచి పద్ధతి కాదని సూచించారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజా మద్దతు బలంగా ఉందని, ఆ మద్దతును కాపాడుకోవాలంటే ప్రజల్లో విశ్వాసం కలిగించే వ్యక్తులకు అవకాశాలు ఇవ్వాలని తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, చుట్టపు చూపులా వచ్చిపొతే ప్రజలు నమ్మరని అన్నారు. పిసిసి మార్గదర్షం మేరకు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 100శాతం నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకే అవకాశాలు దక్కుతాయని వెల్లడించారు.

రాష్ట్రం ఇప్పుడు ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొంటుందని, ఇప్పటికే స్తొమతకు మించి కేసీఆర్ అప్పులు చేశాడాని అన్నారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆరఎస్, బీజేపీ పార్టీలు తీవ్రమైన దాడి చేస్తున్నాయని దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతా ఒక్కటే అనే నినాదంతో ముందుకు వెళ్లాలని అప్పుడే ప్రత్యర్థిని దెబ్బకోట్టగలమని పేర్కొన్నారు. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మన లక్ష్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, పిసిసి ప్రధాన కార్యదర్శి లకావత్ దన్వంతి, పిసిసి నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *