వివిధ దేశాల సుందరీమణుల
రామప్ప సందర్శనకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేయాలి
ఈ నెల 14న యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ను సందర్శించనున్న సుందరీమణులు.
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
**
ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఈనెల 14వ తేదీన ములుగు జిల్లా పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులును ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హైదరాబాద్ లో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు
ఈ నెల 14వ తేదీన రామప్ప సందర్శన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్ పి శభరిష్, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు లతో కలసి సంబంధిత అధికారులతో సందర్శన ఏర్పాట్లు, భద్రత, పర్యటన ప్రాంతాల వద్ద ఏర్పాట్లు, తదితర అంశాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ షోబోట్ ప్రతినిధులు వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు సందర్శించే ప్రదేశాలను వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుండి రామప్ప హరిత కాకతీయ హోటల్ కి చేరుకుంటారని, అక్కడ వారికి స్వాగతం కార్యక్రమం ఉంటుందన్నారు. వారి రాక సందర్భంగా పోలీస్ భద్రత పటిష్టంగా ఉండాలని అన్నారు. హరిత కాకతీయ నుండి రామప్ప దేవాలయానికి చేరుకుని దైవ దర్శనం చేసుకుంటారని, ఆలయం వద్ద బ్యారికేడ్ల ఏర్పాటు చేయాలని, ఆలయ విశిష్టతను తెలియజేసేందుకు గైడ్ అందుబాటులో ఉండాలన్నారు. అక్కడ ఫోటో షూట్, వాహనాల పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ షో బోట్ ప్రతినిధి , పోలీస్, పర్యాటక, ఇతర అధికారులతో చర్చించారు. యునెస్కో గుర్తింపు పొందిన దేవాలయం సందర్శన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, డిన్నర్ అనంతరం హైదరాబాద్ కు బయలుదేరుతారని అన్నారు.
……
అంతకుముందు
మే 8వ తేది నుండి 17 వరకు శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. ఆదేశించారు.
మంగపేట మండల మల్లూరు గ్రామం లోని శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం లో మే 8వ తేది నుండి 17 వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై అధికారుల తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ
మే 8వ తేది నుండి 17 వరకు శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, పారిశుద్ధ్యం, త్రాగునీటి ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగాలన్నారు. లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని
అన్నారు.
ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్,
డి ఎస్ పి రవీందర్, సంబంధిత శాఖల అధికారులు, మండల అధికారులు , తదితరులు పాల్గొన్నారు.