The City Walls of Hyderabad
The City Wall of Hyderabad అనేది హైదరాబాద్ చుట్టూ నిర్మితమైన నగర గోడ.

ప్రస్తుత పాత హైదరాబాద్ నగరానికి చుట్టుకి ఈ గోడ నిర్మితమైనది. దాదాపు 6 మైళ్ళు (9.7 కిమీ) పొడవు మరియు 4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. కుతుబ్ షాహి రాజవంశం చివరి సుల్తాన్ అబుల్ హసన్ కుతుబ్ షా ఈ గోడ ప్రాకారాన్ని నిర్మాణాన్ని ప్రారంభించాడు . దక్కన్ మొఘల్ గవర్నర్ ముబారిజ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మాణం కొనసాగింది. హైదరాబాద్ రాష్ట్ర మొదటి నిజాం ఈ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా, దాదాపు అన్ని గోడలు కనుమరుగయ్యాయి. అయితే, అలియాబాద్ వద్ద ఈ గోడల ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. ఈ వాల్ చుట్టూ నిర్మించిన పదమూడు ద్వారాలలో కేవలం రెండు మాత్రమే ఇప్పటికీ ఉన్నాయి. ఈ దర్వాజాల వివరాలు
*పురానా పుల్ వద్ద పురానా పుల్ దర్వాజా (మనుగడ లో ఉంది )
*డబీర్పురా వద్ద దబీర్పురా దర్వాజా (మనుగడలో ఉంది) .
*చాదర్ ఘాట్ వద్ద చాదర్ ఘాట్ దర్వాజా .
*యాకుత్పురా వద్ద యాకుత్పురా దర్వాజా .
*అలియాబాద్ లోని అలియాబాద్ దర్వాజా .
*చంపా దర్వాజా
*లాల్ దర్వాజా
*గౌలిపురా దర్వాజా
*ఫతే దర్వాజా
*దూద్బౌలి దర్వాజా
*దిల్లీ దర్వాజా
*మీర్ జుమ్లా దర్వాజా

*అఫ్జల్ దర్వాజా , 1861లో అఫ్జల్ అద్-దౌలా, అసఫ్ జా V నిర్మించిన ద్వారాలలో చివరిది. గోతిక్ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ అఫ్జల్ దర్వాజా మూసి వరదల సందర్బంగా దెబ్బతినగక్ఆ, 1954 లో పూర్తిగా తొలగించారు. (Glimpses of the Nizams Dominions )

సేకరణ: కన్నెకంటి వెంకట రమణ, 28.4.2025
Joint Director I&PR