భారతదేశ భగవత్ గీతకు నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

భారతదేశ భగవత్ గీతకు నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. ఈ సంతోకరమైన విషయాన్ని స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోది తన ఎక్స్ వేదికలో దేశ ప్రజలతో పంచుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికీ ఈవిషయం గర్వకారణమైన క్షణం! అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోది ట్వీట్ చేశారు.

భగవత్ గీతతో పాటు నాట్యశాస్త్రానికి UNESCO యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో చోటు దక్కడం మన శాశ్వత జ్ఞానానికి, సంపన్న సంస్కృతికి ప్రపంచ స్థాయిలో లభించిన గుర్తింపు అన్నారు.

గీత మరియు నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని ప్రతీకగా నిలిచాయన్నారు. వాటి లోతైన అర్థాలు ప్రపంచాన్ని ఇప్పటికీ ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *