మతం, దేవుడి పేరుతో బీజేపీ, ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారు
మోదీ పాలనలో అన్ని వ్యవస్థలనూ నాశనం చేస్తున్నారు
రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలను ఏకం చేయడానికి, వారికి న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు.
ఆదివాసీలు, గిరిజనులు, రాజకీయంగా, సామాజికంగా ఎదిగినప్పుడే సమాజంలో సరైన గుర్తింపు వస్తుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా బునియాడి కార్యకర్తల సమ్మేళన్ 3 రోజుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ డాక్టర్ కడియం కావ్య
ఏఐసిసి ఆదేశాల మేరకు తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హన్మకొండ హరిత కాకతీయ హోటల్ లో నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా బునియాడి కార్యకర్తల సమ్మేళన్ 3 రోజుల శిక్షణ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ గారితో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే లు రాంచంద్రు నాయక్, మురళి నాయక్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ….దేశంలో హింసను, విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతమని వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య అన్నారు. మతం, దేవుడి పేరుతో బీజేపీ, ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
దేశంలోని ప్రతి ఇంట్లోనూ దేవుడు ఉన్నాడు. కానీ మోదీ మాత్రం దేవుడు తన దగ్గరే ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు అని విమర్శించారు. మోదీ పాలనలో అన్ని వ్యవస్థలనూ నాశనం సిహిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తున్నామని చెప్తూ బలహీనం చేస్తున్నారన్నారు. మణిపూర్ ఘటనపై పార్లమెంట్లు ఒక్కసారి కూడా మోడీ నోరు మెదపలేదన్నారు. మోడీ విభజించు – పాలించు అనే సూత్రం ఆధారం చేసుకొని పరిపాలన కొనసాగిస్తున్నాడని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారు ఒక రాజకీయ నాయకుడే కాదు గొప్ప మానవతావాది అని ఎంపీ తెలిపారు. రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలను ఏకం చేయడానికి, వారికి న్యాయం జరగాలని పని చేస్తున్నారని వెల్లడించారు. ఆదివాసీలు, గిరిజనులు, రాజకీయంగా సామాజికంగా ఎదిగినప్పుడే సమాజంలో సరైన గుర్తింపు వస్తుందని ఎంపీ అన్నారు. దేశంలోని గిరిజన ఆదివాసీల హక్కుల కోసం కాంగ్రెస్ ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఒక్కో కాంగ్రెస్ కార్యకర్త ఒక్కో సైనికుల్లా పనిచేసి రాహుల్ గాంధీ గెలుపు కోసం కృషి చేయాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐసిసి శిక్షణ తరగతుల కన్వీనర్ రాహుల్ బాలే, డా. తేజావత్ బెల్లయ్య నాయక్, ఏఐసిసి, పిసిసి ప్రతినిధులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.